నిన్నటి వరకు జగన్ను టార్గెట్ చేసిన ఫిరాయింపు మంత్రి ఆదినారయణరెడ్డి ఇప్పుడు పవన్ను టార్గెట్ చేశారు.తాజాగా మంత్రి జనసేనుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్కు కూడా అచ్చం జగన్లాగే సీఎం కావాలన్న ఆశ ఉందని ఆసక్తికర కామెట్స్ చేశారు. రాజకీయమంటే మూడు ఫైట్లు ఆరు డ్యూయెట్లు కాదని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏంమాట్లాడాతారో ఆయనకే స్పష్టతలేదన్నారు. ఆయన ఒక పార్ట్ టైమ్ రాజకీయ వేత్త అని విర్శించారు . పనిలో పనిగా భాజాపాపైకూడా ఆరోపనలు గుప్పించారు. నాలుగేళ్లుగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తమకు చుక్కలు చూపించిందని ఆది నారాయణ రెడ్డి అన్నారు.
ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే అది వీగిపోతుందనే తాము మద్దతు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. పీకే కంటె తెలుగు ప్రజలు తెలివైన వారని ఇక్కడ ఆయన పప్పులు ఉడకవన్నారు.