Wednesday, May 15, 2024
- Advertisement -

బాబుకు నిద్ర‌లేకుండా చేస్తున్న క‌డ‌ప టీడీపీ వ‌ర్గ పోరు…

- Advertisement -

క‌డ‌ప జిల్లా అధికార పార్టీ టీడీపీలో వ‌ర్గ విబేధాలు మ‌రో సారి భ‌గ్గుమ‌న్నాయి. అస‌లే ప్ర‌జ‌ల్లో గ్రాఫ్‌ప‌డిపోవ‌డం మ‌రో వైపు ముంచుకొస్తున్న ఎన్న‌క‌లు ఇలాంటి స‌మ‌యంలో నేత‌ల మ‌ధ్య ఉన్న మ‌న‌స్ప‌ర్థ‌ల‌కార‌నంగా బాబుకు నిద్ర‌ప‌ట్ట‌డంలేదు. ఒక్క క‌డ‌ప జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పార్టీలో నేత‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే భ‌గ్గుమంటోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సొంత జిల్లాలో దెబ్బ‌కొట్టాల‌ని చూస్తున్న బాబుకు ఇంటిపోరు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి బాబు స‌న్నిహితుడైన సీఎ ర‌మేష్‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఆదివారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. ఈ మ‌హాన‌డు నేత‌ల మద్య విమ‌ర్శ‌ల‌కు వేదికైంది.

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ప్రతి పనికీ అడ్డొస్తే కనిపిస్తే కాల్చివేత రోజులొస్తాయని మంత్రి ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. పోట్లదుర్తి కుటుంబీకులకు చెప్పులతో కొట్టే రోజులు వస్తాయన్నారు. ప్రతి దానికి అడ్డుపడటమేకాకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారని, తాను గన్‌లాంటి వాడిని.. కార్యకర్తలు బుల్లెట్‌లను అందిస్తే తన పని కాల్చడమేనని మంత్రి పేర్కొన్నారు.

అలాగే జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ నేత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీద కూడా ఆదినారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. తన గురించి రామసుబ్బారెడ్డి వర్గీయులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్ తనదే అని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.

ఇటీవల సీఎం ర‌మేష్‌పై టీడీపీ సీనియర్ నేత వరదరాజుల రెడ్డి కూడా తీవ్రంగా విమర్శించారు. ఇక మరోవైపు నుంచి ఆదిపై మాటల దాడి మొద‌లు పెట్టారు మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి. ఆది అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి పార్టీనేత‌ల మ‌ధ్య చిచ్చుపెడుతున్నార‌ని విమ‌ర్శించారు. ఇలా ఒక‌రిమీద ఒక‌రు మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -