Wednesday, May 15, 2024
- Advertisement -

బాల‌కృష్ణ చాలా తేడా… అంబ‌టి

- Advertisement -

బాబు చేస్తున్న దీక్ష ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కాని …420 దీక్ష‌ని వైసీపీ నేత అంబ‌టి రాంబాబు ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, సీపీఐ, సీపీఎంలు, జనసేన పార్టీ మీకు మద్దతు ఇవ్వలేద‌న్నారు. దీక్షలో పాల్గొనమని చెప్పిన పార్టీల వాళ్లందరూ ద్రోహులా….ప్రభుత్వ సొమ్ముతో చేసిన నిరాహార దీక్షఇదాని ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు ఒక రోజు దీక్ష‌లో ప్ర‌ధాన‌మంత్రి మోదీపై బాల‌య్య తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై అంబ‌టి స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చాలా తేడా మనిషన్న అంబటి.. ప్రధానిపై ఆయన చేసిన కామెంట్స్‌పై స్పందించబోనని చెప్పారు.

మరోవైపు టాలీవుడ్‌ను కుదిపేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారంపై పవన్‌ కల్యాణ్‌ స్పష్టమైన ప్రకటన చేసిన విషయాన్ని అంబటి ప్రస్తావించారు. రేపు (ఆదివారం) జరగబోయే వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంబటి రాంబాబు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -