Friday, May 17, 2024
- Advertisement -

అనంతలో మంత్రి కుమారుడి కిడ్నాప్‌ల పరంపర…

- Advertisement -

అనంతపురం జిల్లాలో టీడీపీ మంత్రి కుమారుడి దందాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నారు. కిడ్నాప్‌లు చేయడం, బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఇటీవల జిల్లాల్లో ఎక్కువైంది.

మంత్రి కుమారుడి నాయకత్వంతో ఈ కిడ్నాప్‌ ముఠా చెలరేగిపోతోంది. ఈ వ్యవహారం సీఎం వరకు వెళ్లింది. అయినా మంత్రి కుమారుడి నేరాలు ఆగడం లేదు. తాజాగా కర్నాటకకు చెందిన ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి నాలుగు కోట్లు గుంజే ప్రయత్నం చేశారు.

అనంతపురం జిల్లా పోలీసులు కళ్లు మూసుకున్నా కర్నాటక పోలీసులు ఎంటరవడంతో వ్యవహారం బయటకు వచ్చింది. మంత్రి కుమారుడి ఆధ్వర్యంలోని ముఠా కొంతకాలం క్రితం బెంగళూరువెళ్లి అక్కడ సలీం అనే ఒక ప్రముఖ వ్యక్తిని తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించింది. ఈ ముఠా మాయమాటలు నమ్మిన సలీం అడ్వాన్స్ కింద 70 లక్షలు ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత బంగారం సిద్ధంగా ఉంది వచ్చి తీసుకెళ్లండి అంటూ సలీంకు ముఠా ఫోన్ చేసింది.

బంగారం కోసం సలీం రాగానే మంత్రి కుమారుడి ముఠా అతడిని కిడ్నాప్‌ చేసింది. మంత్రి స్వగ్రామం తీసుకెళ్లి బంధీంచారు. ఇష్టమొచ్చినట్టు కొట్టారు. మరో 40 లక్షలు తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. నాలుగు కోట్లు ఇస్తేనే వదిలేస్తామని లేకుంటే శవం కూడా దొరకదని..బెదిరించారు. వారు పెట్టిన చిత్రహింసలు భరించలేక సలీం నాలుగు కోట్లకు పత్రాలపై సంతకాలు చేసి వెళ్లాడు. అయితే మౌనంగా ఉండకుండా సలీం బెంగళూరు పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పారు. దీంతో బెంగళూరు పోలీసులు అనంతపురం జిల్లాలోకి ఎంటరై విచారణ జరిపారు.

ముఠాలో ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసి అనంతపురం జిల్లా పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ముఠా లీడర్‌ మంత్రి కుమారుడు కావడంతోఅనంతపురంజిల్లా పోలీసులు నోరుమెదపడంలేదు. కిడ్నాప్‌లో పాల్గొన్న ముఠాసభ్యులు దొరికింది వాస్తవమేనని.. వారిని విచారిస్తున్నామని అన్ని వివరాలు త్వరలోనే చెబుతామంటున్నారు.

ఈ మంత్రికుమారుడి ముఠా ఇటీవల ధర్మావరంలోనూ ఒక వ్యక్తిని భూమి కోసం కిడ్నాప్ చేసింది. అయితే సదరు వ్యక్తికి టీడీపీకే చెందిన ఎమ్మెల్యే వరదాపురం సూరి అండగా నిలవడంతో వ్యవహారం సీఎం వరకు వెళ్లింది. అయినప్పటికీ మంత్రి కుమారుడిని దందాల పర్వం మాత్రం ఆగలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -