Tuesday, May 14, 2024
- Advertisement -

సొంత జిల్లాలో బాబుకు బిగ్ షాక్‌….పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

సీఎం చంద్ర‌బాబుకు వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతూనె ఉన్నాయి. సీనియ‌ర్ నాయ‌కులు ఒక్కొక్క‌రే పార్టీని వీడుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు పోలింగ్ స‌మీపిస్తున్న తరుణంలో సొంత జిల్లాలో బిగ్ షాక్ త‌గిలింది. శ్రీకాల‌హ‌స్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్సీవీ నాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. రేపు నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరతానని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వల్ల గత ఐదేళ్లుగా అనేక అవమానాలకు గురయ్యానన్నారు.

శ్రీకాళహస్తితో పాటు గూడూరులలో టీడీపీని చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కాల‌హ‌స్తి న‌యోజ‌క వ‌ర్గంలో మ‌చం ప‌ట్టున్న‌నేత కావ‌డంతో ఈసారి ఎన్నిక‌ల్లో టీడీపీనుంచి టికెట్ ఆశించారు. అయితే బాబు మాత్రం ఆయ‌న‌కు మొండిచేయి చూపారు. బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి కొడుకు బొజ్జ‌ల సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల్లో గోపాల‌కృష్ణ బ‌రిలో ఉండ‌టంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన నాయుడు…ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఈసారి పోటీ చేసె అవ‌కాశం ఇవ్వాల‌ని బాబును కోరినా హ్యాండ్ ఇచ్చారు. దీంతో గ‌త కొద్ది రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించారు. కార్య‌క‌ర్త‌లు వైసీపీలో చేరాల‌ని ఒత్తిడి చేశారు. దీంతో ఆయ‌న వైసీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -