ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణాలో ఆంధ్రప్రజలపై దాడులు చేస్తున్నారని పదే పదే చేస్తున్న విమర్శలపై టీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. తెలంగాణాలో ఆంధ్ర ప్రజలమీద దాడులు ఎక్కడ జరిగాయో చెప్పగలవా పవన్ అని ప్రశ్నించారు. పవన్ తన వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
నిన్నటి వరకు హైదరాబాద్లోనె పవన్ ఇప్పుడు హటాత్తుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీశారు. మీ స్వార్థం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టవద్దని పవన్కు హితవు పలికారు. హైదరాబాద్లో 80 శాతం మంది టీడీపీ నేతలకు హైదరాబాద్లో ఆస్తులున్నాయని, వారంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవడం లేదా? అని ప్రశ్నించారు.
బెదిరింపులకు దిగేవారిమైతే ప్రశాంతంగా వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అన్నీ కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయని, కేసీఆర్ ను తలచుకోకుండా ఒక్క క్షణం కూడా చంద్రబాబు ఉండలేకపోతున్నారని అన్నారు. ఎన్నికల్లో వైసీపీకి 125-130 అసెంబ్లీ, 18-23 ఎంపీ సీట్లు వస్తాయని జాతీయ సర్వేలన్నీ చెబుతున్నాయని జగన్ సీఎం కావడం తథ్యం అన్నారు.