Saturday, April 20, 2024
- Advertisement -

టీడీపీ త‌మ్ముల్లో మ‌రోసారి అసంతృప్తి..

- Advertisement -

రాష్ట్ర‌రాజ‌కీయాల్లో నంద్యాల ఉప ఎన్నిక అంద‌రిలోను హాట్ టాపిక్‌గా మారింది. అక్క‌డ ప్ర‌చారం చేస్తున్న టీడీపీ పార్టీకి చుక్కులు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటె అధినేత బాబుకు షాక్‌ల‌మీద షాక్‌లు ఇస్తున్నారు. గెలుపుపై స‌ర్వేల‌మీద స‌ర్వేలు చేయిస్తున్నారు. తాజా స‌ర్వేలో ప్ర‌జ‌లు పూర్తి వ్య‌తిరిక‌త ఉండ‌టంతో బాబు అండ్ టీంకు మ‌రో దెబ్బ‌త‌గిలింది. ఏడు అంశాల‌పై నిర్వ‌హించిన స‌ర్వేలో ఒక్క దాంట్లోను పాస్ మార్కులు రాలేదంట‌. దీంతో బాబులో అసంతృప్తి నెల‌కొంది.
అయితే స‌ర్వేపై బాబు మాత్రం క‌ప్పిపుచ్చుకొనేందుకు ప్ర‌య‌త్నించార‌ట‌. ప్ర‌ధానంగా గృహ‌నిర్మానంపై ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చె నెల్లో ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రానుంద‌ని అంత‌లోపు నాయ‌కులంద‌రూ నంద్యాల‌పైనె దృష్టి సారించాల‌ని బాబు హిత‌బోధ‌న చేశార‌ని తెలుస్తోంది.
ఇవ‌న్నీ ఒక ఎత్తైతె బాబుకు అప‌న‌మ్మ‌కం ఎక్కువ‌. త‌న‌ను త‌ప్ప ఎవ‌రిని అంత‌తేలిక‌గా న‌మ్మ‌ర‌నే విష‌యం తెలిసిందే.అందుకే నియేజ‌క‌వ‌ర్గంలో ఒక స‌హాకుడిని పార్టీ త‌రుపున నియ‌మిస్తాన‌ని చెప్పారంట‌.అయితే దీనిపై తెలుగు త‌మ్ముల్లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారంట‌.నేత‌ల‌పై నిఘాపెంచేందుకే బాబు ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.టీడీపీ త‌మ్ముల్లో మ‌రోసారి అసంతృప్తి రావ‌డం ఖాయంగా తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -