కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీలో ముసలం తారాస్థాయికి చేరింది. భూమా కోటకు బీటలు ఏర్పడ్డాయి. గత కొంతకాలంగా అఖిల, ఏవీ మధ్య విబేధాలు ఉన్నసంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అవి తారాస్థాయికి చేరాయి. గతంలో అనేక సార్లు ఇద్దరి మధ్య విబేధాలు అనేకసార్లు బయటపడ్డాయి. అవి ఇప్పుడు రచ్చ కెక్కాయి.
అఖిల మంత్రి పదవి చేపట్టినప్పటినుంచే ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. దానికతోడు పార్టీలో తనకు గుర్తింపు, సరైన గౌరవం ఇవ్వడం లేదు అని ఆయన సన్నిహితులు తెలియచేస్తున్నారు. దీనికి తోడు ఏవీ సుబ్బారెడ్డి వైసీపీలోకి వెల్తారన్న వార్తలుకూడా వినిపించాయి.
తాజాగా ఆళ్లగడ్డలో ఏవీ హెల్ప్లైన్ను ఏవీ సుబ్బారెడ్డి ఏర్పాటు చేశారు. అయితే… ఈ హెల్ప్లైన్ ప్రారంభోత్సవానికి భూమా వర్గీయులు వెళ్లకుండా మంత్రి అఖిలప్రియ అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి.మంత్రి మాట వినకుండా కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. దీంతో ఇద్దరి మధ్య వార్ మరింత ముదరింది. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ప్రకటించనున్నారు ఏవీ సుబ్బారెడ్డి.