వచ్చే ఎన్నికలలో ఎట్టిపరిస్థితులలో తిరిగి మళ్లీ అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు. దీనిలో భాగంగానే ఆయన వివిధ పార్టీ నాయకులకు గాలం వేస్తునట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీలో బలమైన నాయకులకు టిక్కెట్,డబ్బలు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే బాబు కన్ను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపై పడినట్లుంది. ఆయనను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే కాపు కులపు ఓట్లతో పాటు,జనసేన అధినేత పవన్ కల్యాణ్కు చెక్ పెట్టవచ్చు అని బాబు భావిస్తున్నాడు.చిరుని పార్టీలోకి తీసుకువచ్చే బాద్యతను ముగ్గురు మంత్రులను అప్పజెప్పినట్లు సమాచారం.
దీనిలో భాగంగానే మంత్రి కొల్లు రవింద్ర చిరంజీవిని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి మంత్రి రవింద్ర ఎందుకు కలిశారో మాత్రం తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీలో చిరంజీవి చేరితే పవన్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి ఆయన పార్టీ కార్యక్రమలలో పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో ఆయన వచ్చే ఎలెక్షన్స్ నాటికి వేరే పార్టీలో చేరతారనే వార్తలు వినబడుతున్నాయి.