- Advertisement -

రాష్ట్ర‌భాజాపాలో కీల‌క మార్పులు..రేపో మాపో కొత్త అధ్య‌క్షుడి నియామ‌కం

- Advertisement -

ఏపీ రాజ‌కీయాలు కీల‌క మార్పులు రాబోతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ,భాజాపా ఇప్పుడు వైరి ప‌క్షాలుగా మారడంతో భాజాపాలో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర భాజాపా ఇన్‌ఛార్జ్‌గా రామ్‌మాధ‌వ్ నియామ‌కం త‌ర్వా పార్టీలో స‌మూల మార్పుల‌కు శ్రీకారం చుట్టారు.

ప్ర‌స్తుతం రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబును ఆ పదవి నుంచి తొలగించబోతున్నారు. ఆయ‌న స్థానంలో మాజీ మంత్రి మాణిక్యాల్‌రావును కొత్త అధ్య‌క్షుడిగా నియ‌మించ‌బోతున్నారు.

మొద‌టినుంచి హరిబాబు మెతకవైఖరి పట్ల బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో, హరిబాబు దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారని భావిస్తోంది. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షుడు దూకుడుగా లేకపోతే బీజేపీకి ఇబ్బందికరంగా మారుతుందనే భావనకు అగ్ర నేతలు వచ్చారు.

రాష్ట్ర అధ్యక్షుడి పదవికి మాణిక్యాలరావు, సోమువీర్రాజు, కన్నాలక్ష్మిణారాయణల పేర్లను పరిశీలించింది. వీరు ముగ్గురు ఒకే సామాజికవర్గానికి చెందినవారు. వీరిలో మాణిక్యాలరావువైపు అధిష్టానం మొగ్గుచూపింది. దీనికి సంబంధించి రేపోమాపో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

మాణిక్యాలరావు నియామకంలో ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ రామ్ మాధవ్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సోమువీర్రాజు వైపు తొలుత మొగ్గు చూపినప్పటికీ… ఆయన కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం ఉందని రామ్ మాధవ్ భావించారు. అధ్యక్ష పదవిలో ఉన్నవారికి దూకుడుతో పాటు, కొన్ని సమయాల్లో సంయమనం కూడా అవసరమని ఆయన భావించారు. దూకుడు, సంయమనం రెండూ ఉన్న వ్యక్తి మాణిక్యాలరావు అనే తుది నిర్ణయానికి ఆయన వచ్చారు. మరోవైపు అధ్యక్ష పదవిని ఆశించిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణలను బుజ్జగించేందుకు… వారిని జాతీయ కమిటీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -