చంద్రబాబు నాయుడికి త్వరలో మరోషాక్ తగలనుందనే వార్త హల్ చల్ చేస్తోంది. ఆపార్టీ సీనియర్నేత కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పార్టీకీ గుడ్బాయ్ చెప్పబోతున్నారనే వార్త బాబులో ఆందోళన మొదలయ్యింది. గత కొంతకాలంగా బాబుతో అశోక్ గజపతిరాజుకు సరిగా పొసగడంలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భాజాపా గాలం వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
విజయనగరం ఎంపిగా ఉన్న రాజుగారు వచ్చే ఎన్నికల్లో తన కూతురును పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారంట. 30 ఏళ్ళుగా అశోక్ కు జిల్లాలో తిరుగులేదు. ప్రభుత్వంలో ఉన్నపుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కానీ రాజగారు ఏమనుకుంటే అది జరిగేది. ఒకపుడు ఎన్టీఆర్ కూడా విజయనగరం జిల్లా విషయాల్లో వేలు పెట్టే వారు కారట.
జిల్లాలో రాజుగారు అనుకున్న పనులు జరగడంలేదు. రాజు వ్యతిరేకులను బాబు బాగా ప్రోత్సహిస్తున్నారు. జిల్లాకు ఇన్చార్జిగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఏరికోరి చంద్రబాబు నియమించినప్పటినుంచి రాజుగారికి వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో గంటా ఈ జిల్లాలోని నెల్లిమర్ల నుండి పోటీ చేయాలని చూస్తున్న గంటా జిల్లాలో ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకునే పనిలో పడ్డారు. అందుకనే అశోక్గజపతిరాజు వ్యతిరేకులందరిన్నీ చేరదీస్తున్నారు. జిల్లాకు ఇన్చార్జిగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఏరికోరి చంద్రబాబు నియమిచారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు ప్రధాని మోదీకి చేరుతున్నాయంట. అందుకే ప్రత్యేకంగా మంత్రిగారిని పిలిపించుకొని మాట్లాడారంట ప్రధాని. టిడిపిలోని కొందరి పేర్లు చెప్పి వీళ్ళ మధ్య ఎంతకాలం ఉంటారని ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది. ఎటూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేదుకాబట్టి టిడిపికి రాజీనామా చేస్తే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారట. మరి రాజుగారు ఎలాంటి నిర్ణయం తీసుఉంటారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.