- Advertisement -
ఈ ఏడాది ఏపిలో వివిధ ఆలయాలపై దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని.. హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తూ పశ్చాతాప పడాల్సి వస్తుందని.. ఆలయాలపై దాడులు చేస్తే చూస్తు ఉండరని గట్టి బుద్ది చెప్పాల్సి వస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ ఫైర్ అయ్యారు.
కాగా, విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో పుణ్య క్షేత్రమైన రామతీర్థం రామ గిరిపై శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన ఘటనపై పలు పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో దేవుళ్ల విగ్రహాలు, ఆలయాలపై దాడుల ఘటనలను ఖండిస్తున్నామని తెలిపారు. రామతీర్థం ఘటన చాలా బాధాకరమని చెప్పారు. ఇటువంటి చర్యలు ఇకనైనా ఆగాలని ఆయన అన్నారు.