నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజలు తమవెంటే ఉన్నారన్న సంకేతాలను పంపాలని భావిస్తున్న వైకాపా… అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారన్న నినాదంతో తెలుగుదేశం పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయినప్పటికీ టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. దీనికి కారణం రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటంతో పాటు.. స్థానిక పరిస్థితులు ఆ పార్టీకి ముచ్చెమటలు పోయిస్తున్నాయి.
దీంతో ఈ ఉప ఎన్నికల పోరుకు సినీ గ్లామర్ను కూడా జోడించాలని టీడీపీ నిర్ణయించింది. రాయలసీమ ప్రాంతంలో అమితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణను కనీసం మూడు నుంచి నాలుగు రోజుల పాటు ప్రచారం నిమిత్తం తీసుకురావాలని తెలుగుదేశం భావిస్తోంది. ఇందుకు బాలయ్య కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
అలాగే, 2014లో తమకు అనుకూలంగా ప్రచారం చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను కూడా నంద్యాలలో తమ తరపున పోటీ చేసే అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసేలా చూడాలని భావిస్తోంది. ఇక ఆయన ప్రచారానికి రాలేనని చెబితే, కనీసం మీడియా ముఖంగానైనా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేలా పవన్ కళ్యాణ్తో చెప్పించాలని భావిస్తోంది.కనీసం బాలకృష్ణ వస్తె టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపవచ్చనేది నాయకుల ఆశ.