ఎపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టీడీపీ, భాజాపా మధ్య మాటల పోరు నడుస్తోంది. భాజాపాతో విడిపోయిన ప్పటినుంచి ఇరు పార్టీల నేతలు ఒకరిమీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా భాజాపా అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారయణ బాబుపై సంచలన విమర్శలు చేశారు. బాబు ఓ గజదొంగని రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారన్నారు.
బాబు కన్ను ఇప్పుడు దేశం మీద పడిందని, దేశాన్ని దోచుకోవడానికి సిద్దమయ్యారని కన్నా ఆరోపించారు. అందుకే భాజాపాపై విమర్శలు చేస్తున్నారన్నారు.గతంలో కాంగ్రెస్, సోనియా , రాహుల్ తీవ్రంగా విమర్శించిన బాబు ఇప్పుడు వారిగూటికే చేరారని ఎద్దేవ చేశారు.
దేశంలో ఎక్కడ ఏంజరిగినా దాన్ని మోదీతో ముడిపెడుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరిగిన దొంగ బాబు కాదాని ప్రశ్నించారు. రాష్ట్రంలో హైకోర్టు పూర్తి కాకుండానే హైకోర్టును తెచ్చుకున్నారని మండిపడ్డారు.