ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మిత్రపక్షంగా ఉన్న భాజాపా మాటల దాడిని పెంచింది. నిన్నటి వరకు రాష్ట్రనేతలు విమర్శలు ఎక్కుపెడితే ఇప్పుడు భాజాపా ఏపీ రాష్ట్ర వ్యవహారా ఇన్ఛార్జ్ రాంమాధవ్ బాబుపై సంలచన కామెట్స్ చేశారు. బాబుకు తెలిసినన్ని జిమ్మిక్కులు ఎవరికీ తెలియవని ఆరోపించారు.
రాజకీయ లబ్ది కోసమే ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిందని, ఏపీలో టీడీపీ పొలిటికల్ గేమ్ ఆడుతోందన్నారు. పొలిటికల్ గేమ్స్లో ఎవరూ కూడా చంద్రబాబును బీట్ చేయలేరని విమర్శించారు. చంద్రబాబు తన వైఫల్యాలను తమపై నెట్టాలని చూస్తున్నారని, కానీ తాము అలా జరగనివ్వమని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రానికి చాలా సాయం చేశామని, భవిష్యత్తులోనూ మరింత చేస్తామని హామీ ఇచ్చారు. ‘వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబు సిద్ధహస్తులని… సొంతమామకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అధికారం పేరుతో చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు’ అని రాం మాధవ్ విమర్శించారు.
అవిశ్వాస తీర్మానం గురించి తాము భయపడేది లేదని, తమకు పార్లమెంట్లో సరిపడ సభ్యులున్నారని చెప్పారు. టీడీపీ వైఖరి కేవలం రాజకీయమేనని, ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాన్ని అకస్మాత్తుగా తెరపైకి తీసుకురావడంపై, ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని డిమాండ్ చేశారు.