Sunday, May 5, 2024
- Advertisement -

జగన్ సర్కార్‌పై ఫైర్ అయిన యామిని..!

- Advertisement -

మద్యం అమ్మకాలు ఏపీలో మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అదనపు రీటైల్‌ ఎక్సైజు ట్యాక్సు పేరిట మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ధర పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ప్రతిపక్షలు విమర్శలు చేస్తున్నయి. తాజాగా బీజేపీ నేత యామినీ శర్మ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. మద్యం షాపులు తెరిస్తే… కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉంటుదని ఆమె అన్నారు. ఆదాయం కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. కేంద్రం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చినా రాష్ట్రాలు ఎందుకు అనుమతి ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. ఇంకోవైపు పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను ఆయా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఇటు ఏపీ సర్కార్ కూడా మద్యం అమ్మకాలకు ఓకే చెప్పింది.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ అమ్మకాలు చేసుకునేందుకు వీలు కల్పించింది. అయితే బార్లు, క్లబ్బులు, ఏపీటీడీసీ లిక్కర్‌ లైసెన్సుతో నడిచే కేంద్రాలను తెరిచేందుకు మాత్రం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. అందులో ముఖ్యమైనది మద్యం విక్రయాలు. మద్యం చాలా రాష్ట్రాల్లో ముఖ్యమైన ఆదాయ వనరు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అన్న బిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఏపీలో కరోనా కేసులు పేరుగుతున్న టైంలో మద్యం షాపులు తెరవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -