Sunday, May 5, 2024
- Advertisement -

క‌న్నా చేరిక‌కు బ్రేక్ వేసిన భాజాపా అధిష్టానం…

- Advertisement -

భాజాపా నాయకుల చేరిక విష‌యంలో వైసీపీకి బిగ్‌షాక్ త‌గిలింది. భాజాపా నుంచి క‌న్నా వైసీపీలోకి చేరికకు ఆ పార్టీ హైకమాండ్ అడ్డుకట్ట వేసిందా…? అవున‌నే అంటున్నాయి తాజా ప‌రిస్థితులు. భాజాపా ఛీఫ్ అమీత్‌షా ఫోన్ చేయ‌డంతో క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ చేరిక అగిపోయిందంట‌. అమిత్ షా చేసిన ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ తో సీన్ రివ‌ర్స్ అయ్యింది. కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన అమిత్ షా… బీజేపీలోనే ఉండాలని కోరడంతో క‌న్నా చేరిక ఆగిపోయింది.

కొద్ది రోజులుగా క‌న్నా భాజాపా అధిష్టానంపై గుర్రుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసునుంచి క‌న్నాను త‌ప్పించ‌డంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాలనుకున్నారు. వైసీపీలో చేరాల‌ని ముహూర్తం ఫిక్స్ చేసుకున్న త‌ర్వాత సీన్ రివ‌ర్స్ అయ్యింది. వైసీపీలో చేరాలని ముహుర్తంగా పెట్టుకొన్న రోజే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం గమనార్హం.

అమీత్‌షా ఫోన్ కాల్‌తో క‌న్నా మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. దీంతో, వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ కు అమిత్ షా ఒక మెసేజ్ పెట్టారనే సమాచారం చ‌క్క‌ర్లు కొడుతోంది. బీజేపీ నేతలెవరినీ వైసీపీలో చేర్చుకోవద్దని మెసేజ్ ద్వారా చెప్పారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -