Wednesday, May 15, 2024
- Advertisement -

గంటా వైసీపీలో చేరిక‌ నాకు తెలియదు: బొత్స

- Advertisement -

మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీపై అస‌హ‌నంతో ఉన్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగానే గంటా వైసీసీలో చేరతారు అనే ఊహ‌గానాలు ఎక్కువైయ్యాయి. దీనిపై తాజాగా వైసీపీ సీనియ‌ర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తున్న విషయం తనకు తెలియదని పార్టీ విధానాలు నచ్చి ఎవరు పార్టీలోకి వచ్చినా వారిని ఆహ్వానం పలుకుతామని ఆయన చెప్పారు.

అయితే వైసీపీలో చేరడానికి ముందే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన చెప్పారు. బుధవారం నాడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 15వ తేదిన వైస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించనున్నట్టు ఆయన చెప్పారు. ఎలెక్ష‌న్స్ నాటికి టీడీపీ నుండి చేరిక‌లు భారీగా ఉంటాయ‌ని ఈ సంద‌ర్భంగా బొత్స తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -