ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇప్పుడు కూడా దాన్ని వదలట్లేదు నాయకులు.సచివాలయం మొత్తం జగన్ కనుసన్నల్లో పనిచేసింది. ఇలా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగనే పాలన నడిపారన్నది తొలి నుంచి టీడీపీ చేస్తున్న ఆరోపణ. చంద్రబాబు కూడా ఈ మాటలను చాలా సార్లు అన్నారు. దీంతో జగన్ ఆక్రమాస్తులపై సీబీఐకేసు ప్రస్తుతం ఏంజరుగుతుందో తెలిసిందే.
తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. జగన్ గురించి నిజాలు మాట్లాడారు. కోట్లాది మంది ప్రజలను మోసంచేసిన చంద్రబాబును నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చినా తప్పులేదన్న జగన్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి స్పందించారు. జగన్ను ఆయన తండ్రే భరించలేకపోయారని వ్యాఖ్యానించారు. జగన్ తీరును భరించలేక … వైఎస్ సీఎంగా ఉన్నన్ని రోజులు హైదరాబాద్ కూడా రానివ్వకుండా బెంగళూరులోనే ఉంచారని చంద్రబాబు చెప్పారు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కూడా ధృవీకరించారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు మాటల్లో డ్యూయల్ టోన్ వినిపిస్తోందని అంటున్నారు. మొన్నటి వరకు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పరిపాలనలో జోక్యం చేసుకొని అక్రమంగా లక్షలకోట్లు సంపాదించారని ఆరోపిస్తూ వచ్చిన చంద్రబాబు… ఇప్పుడు మాత్రం వైఎస్ సీఎంగా ఉన్నన్ని రోజులు జగన్ను కనీసం హైదరాబాద్కు కూడా రానివ్వలేదని చెప్పడం గమ్మత్తుగానే ఉంది.
మోదటినుంచి వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా తండ్రి సీఎంగా ఉన్న సమయంలో జగన్ కనీసం హైదరాబాద్కు కూడా రాకుండా బెంగళూరులో తన పని తాను చేసుకుపోయేవాడని. ఇంతకాలం వైసీపీ వాదనను ఖండిస్తూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పటికైనా వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో జగన్ చక్రం తిప్పలేదని అంగీకరించడం ఆసక్తిగానే ఉందని ఆ పార్టీ నాయకులంటున్నారు.