అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బాబును పొగడ్తలతో ముంచడంలోనూ ఒక్కో సారి విమర్శలు చేయడంలోనూ ఆరి తేరారు. తమ కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో టికెట్లును దక్కించు కొనేందుకు బాబుకు డబ్బా కొట్టడంలో ముందుంటారు. అయితే ఇన్నాల్లు బాబుకు ఊడింగం చేసిన జేసీకి పెద్ద షాక్ ఇచ్చారు చంద్రబాబు. బాబు ఇచ్చిన రియాక్సన్కు ఏం మాట్లాడో తెలియకు కంగు తిన్నారు.
వచ్చే ఎన్నికల్లో తన కొడుకు పవన్ రెడ్డికి ఎంపీ టికెట్టు కోసం జేసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా అమరావతికి వెల్లిన జేసీ ఈ ప్రతిపాదనను బాబు ముందుంచారంట. అంతే బాబు రియాక్సన్కు జేసీ ముఖం చిన్నబోయిందంట. ప్రస్తుతం జిల్లాలో సిట్టింగుల మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న సంగతి తెలిసిందే. బాబు సొంత సర్వేలో కూడా వారిమీద తీవ్ర వ్యతిరేకత ఉండటంతో వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు కనిపించడంలేదు. అందుకే వారిని మార్చాలనుకుంటున్నట్లు బాబు బావిస్తున్నారు.
తన కొడుక్కి ఎంపీ టికెట్లు ఇప్పించుకొని గెలిపించు కొనేందుకు పార్టమెంట్ పరిధిలో ఉన్న శింగనమల, రాయదుర్గం, అనంతపురం అర్బన్, గుంతకల్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జేసీ డిమాండ్ చేస్తూ వచ్చారు. వారి స్థానంలో తనకు అనుకూలంగా ఉన్న వారికి టికెట్లు ఇప్పించు కొనేందుకు నానా పాట్లు పడుతున్నారు.
అయితే తాను తీసిన గోతిలో లోనే తానే పడ్డారు జేసీ.అనంతపురం లోక్సభ టికెట్ మీ కుమారుడికి కావాలంటే ముందు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి వారికి అభ్యంతరం లేనట్టు లేఖలు తీసుకురావాలని ఆదేశించారు. సిట్టింగు ఎమ్మెల్యేలను మర్చాలని చెబుతున్న సమయంలో వారి నుంచి లేఖలు ఎలా తీసుకు రావాలని వాపోయినట్లు సమాచారం. సిట్టింగులకే గెలిచే పరిస్థితే లేకుండా నీ కొడుక్కి టికెట్ ఎలా కావాలని అడుగుతున్నారని బాబు ప్రశ్నించారంట.
మరో వైపు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రాజకీయీల్లోకి తీసుకు రావాలని నాయకులు ఉబలాట పడుతున్నారు. వారిలో ముందుగా పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ముందున్నారు. తన కొడుక్కి టికెట్ కోసం సునీత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో జేసీ పవన్కు ఎంపీ టికెట్ ఇస్తే… తన కుమారుడికి హిందూపురం టికెట్ ఇవ్వాలంటూ పరిటాల సునీత కూడా డిమాండ్ చేస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తాడి పత్రి టికెట్ మాత్రం మీకుంటంబానికే ఇస్తానని బాబు హామీ ఇచ్చారంట. దీంతో చేసేదేమి లేక బాబుకు దండం పెట్టి వెనుతిరిగారంట.