ఎన్నికల వేల ఏపీలో టీడీపీలో వింత పరిస్థితి నెలకొంది. దశాబ్దాల చరిత్ర కలిగివున్న టీడీపీలో ఇప్పుడు గడ్డుపరిస్థితులు నెలకొన్నాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో అభ్యర్తుల ఎంపికను బాబు దాదాపు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పార్టీనుంచి పోటీ చేయండని బాబు బ్రతిమలాడుతున్నా మా కొద్దు బాబోయ్ అంటూ పరుగు పెడుతున్నారు. ఈ పరిస్థితే బాబును కలవర పెడుతోంది.
ఇతర పార్టీల్లో టికెట్లు దక్కక నానా తంటాలు పడుతుంటే…టీడీపీలో మాత్రం టికెట్లు ఇస్తామన్నా ఎవరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపడంలేదు. తెలంగాణాలో కేసీఆర్ దాదాపు సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చి పార్టీని మరో సారి అధికారంలోకి తీసుకొచ్చారు. కాని ఏపీలో మాత్రం బాబు అంత సీన్ లేదు. దానికి కారణం ఇక్కడ బలమైన ప్రతిపక్షపార్టీ ఉండటమే. నాలుగు దశాబ్దాల చరిత్ర వున్న తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులకొరత ఉందని సాక్షాత్యు బాబే సెలవివ్వడం చూస్తె ఆపార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలిసిపోతోంది.
తెలుగు దేశం పార్టీకి అభ్యర్తుల కొరతలేదు….కాని గెలిచే అభ్యర్తులే దొరకడంలేదు. ఎన్నికల్లో పోటీ ఎవరితోనె అనేదానిపై బాబు క్లారిటీ ఇవ్వడంలేదు. ఒక సారి జగన్ను, భాజాపాను మరో సారి టీఆర్ఎస్ను విమర్శించడం అలవాటుగా మారింది.పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా సామాజిక వర్గసమీకరణాలు, బ్యాంకు బ్యాలెన్సులు ఉన్న వారికి టికెట్లు ఇస్తున్నారు. ధన బలం ఉన్నవాల్లలో చాలా మంది బాబు దెబ్బకు బయపడి పక్కు వస్తున్నారు. ప్రతినియోజక వర్గంనుంచి పదిమంది పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారని బాబు గంభీరంగా చెబతున్నా ….మాకు ఫలానా సీటు వద్దు మొర్రో..స పోటీకి ససేమీరా అంటున్నారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టినుంచి పోటీ చేయడానికి అభ్యర్తులు ఆసక్తిచూపడం చూస్తె…పార్టీకి ఇందకన్నా ఘోర అవమానం ఏముంటుంది….?