Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు బిగ్ ప్లాన్ ఏంటంటే..?

- Advertisement -

విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజనీకాంత్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అసలు చంద్రబాబు ఇప్పుడు రజనీకాంత్ ని ఎందుకు అహ్వానించారు..? చంద్రబాబు వ్యుహం ఎంటి..? సర్వత్ర చర్చ జరుగుతుంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఇప్పుడు 2024 ఎన్నికలకు వ్యూహాలు రచిస్తుంది. ఓ పక్క లోకేష్ పాదయాత్ర.. చంద్రబాబు బస్సుయాత్ర పోటా పోటీగా చేస్తూ కేడర్ కు భరోసా ఇచ్చే ప్రయత్నం.. మరోపక్క చంద్రబాబు రాజకీయ వ్యుహలకు పదును పెట్టుతున్నారు.

Also Read: ‘వైఎస్ఆర్’ బ్రాండ్ డ్యామేజ్ చేస్తుంది ఎవ్వరు..? ఎందుకు..?

2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీని మరియు వ్యక్తిగతంగా మోదీని తీవ్రంగా వ్యతిరేకించి.. విమర్శించిన చంద్రబాబు చరిత్ర‌లో తొలిసారి పోత్తు లేకుండా వంటరిగ పోటి చేసి ఘోర పరాజయం అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు మళ్లి బీజేపీ, జనసేన లతో పొత్తు కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. గత కొత్త కాలంగా పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య జరుతున్న పరినామాలు.. మెన్నటికి మెన్నా రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో మోదీని పొగిడిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీకి అత్యంత సన్నిహితుడు అయిన రజనీకాంత్ ను ఎన్టీఆర్ శతజయంతి వేడుక‌ల‌కు ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. ఎలాగైన 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

-Anjanreddy kodathala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -