ఏపీలో టీకొట్టుదగ్గరనుంచి..రాజకీయ నాయకుల వరకు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇప్పుడు ఒకటే హాట్ టాఫిక్. అదేంటొ తెలుసుకోవాలనుందా. అదే నండి ప్రపంచం మెచ్చే అమరావతి రాజధాని గురించి. తెలుగు ప్రజల రాజధాని ఇలా ఉటుందని గ్రాఫిక్స్లో ఇప్పుటి వరకు ప్రజలకు బాబు చూపించారు. కాని ఆదిశగా ఒక్క అడగు ముందుకు పడలేదు. ఇంగ్లాండ్కు చెందిన నార్మన్ పోస్ట్ సంస్థ ఇచ్చి డిజైన్లను బాబు తిరస్కరించారు. అయినా బాబు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు . ఒక సారి ఛీకొట్టినా సిగ్గులేకుండా ఆమరావతి డిజైన్లను బాహాబళి డైరెక్టర్ రాజమౌళికి అప్గగించారు. ఇదే ఇప్పుడు హాట్ టాఫిక్గా మారింది. అయితే ఊరికే ఇవ్వలేదులేండి. దాని వెనుక కథ వేరేది ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని గురించి పెద్దగా సలవిచ్చారు బాబు. నామీద గైరవంతో సింగపూర్ ఉచితంగా అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ ఇచ్చింది..’ అని గతంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చాలా గొప్పగా చెప్పేశారు. డిజైన్లను ప్రీగా ఇచ్చినందుకు అప్పనంగా ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు చంద్రబాబు వేసిన స్కెచ్లు అన్నీ ఇన్నీ కావు.
గతంలో పుష్కరాల నిర్వహణ పేరుతో సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకీ పెద్దమొత్తంలో తన పబ్లిసిటీ కోసం ప్రభుత్వ ధనాన్ని సమర్పించుకున్నారు చంద్రబాబు. పేరేమో పుష్కరాలది, పబ్లిసిటీ మాత్రం చంద్రబాబుది. చంద్రబాబు పబ్లిసిటీ యావ పుణ్యమా అని గోదావరి పుష్కరాల్లో.. అదీ బోయపాటి శ్రీను డైరెక్షన్లో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు.
తాజాగా మరో సారి తన పబ్లిసిటీ స్టంట్ రాజమౌళి దగ్గరకు చేరుకుంది. ‘బాహుబలి’ సినిమాలో మాహిష్మతి రాజ్యాన్ని చూసి, చంద్రబాబుకి కళ్ళు చెదిరిపోయినట్టున్నాయ్. ఇదే తరహాలో అమరావతి నిర్మించేయాలని రాజమౌళికి సూచించేశారు చంద్రబాబు. దీనోసం మూడు దఫాలుగా చంద్రబాబు – రాజమౌళి మధ్య చర్చలు జరిగాయి. బోయపాటి అంటేనే చాలా కాస్ట్లీ …. మరి రాజమౌళి సంగతి చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి ‘మార్కెటింగ్ స్ట్రాటజీస్సలో ఏరేంజ్లో ఉంటుందో ఈపాటికే అందరికి అర్థమయ్యింటుంది.
రాజమౌళి అంటే కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ‘బాహుబలి’ 1500 కోట్ల క్లబ్లో చేరిందంటే, ఆ వెనుకాల రాజమౌళి మార్కెటింగ్ మెలకువలు కీలక పాత్ర పోషించాయన్నది తెలిసిందే. సరిగ్గా అసూత్రం చంద్రబాబుని ఆకర్శించినట్టుంది. అప్పనంగా రాజమౌళి ఆ కిటుకులు చెప్పేస్తాడా.? ఏంటి ఎంతైనా కమర్శియల్ కదా..!చంద్రబాబు
రాజమౌళికి సమర్పించనున్న గౌరవ వేతనం బయటికి రాలేదు. వారిద్దరికే తెలియాలి. నిజం ఏనాడైనా బయటకు వస్తుంది.