త్వరలో ఏపీ మంత్రి వర్గంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయనె వార్తలు నేతల్లో అలజడి రేపుతున్నాయి. మరో సారి మంత్రి వర్గ విస్తరణ చేయాలని బాబు అలోచనలు చేస్తున్నారంట. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కొత్త మంత్రి వర్గ టీమ్ను తయారు చేయబోతున్నారు. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. తన సహచరుల వద్ద బాబు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణ జరిగి సంవత్సరం కూడా కాకుండానె మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేయడంపై కొందరి మంత్రుల్లో ఆందోళన మొదలయితె… మరి కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరనలో మంత్రి పదువులు రాని వారు ఆశలు పెట్టుకున్నారు.
ఇదంతా ఒక ఎత్తైతె …మరో షాకింగ్ వార్త కలకలం రేపుతోంది. మంత్రి వర్గ విస్తరణలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియకు బాబు షాక్ ఇస్తారనె వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అఖిల ప్రియకు డిమోషన్ ఇచ్చి ఆ స్థానంలో భూమా బ్రహ్మానందరెడ్డిని బాబు తీసుకోవాలనె వార్తలు వినిపిస్తున్నాయి. బహిరంగం బాబు చెప్పకపోయినా తన సన్నిహితుల వద్ద ఈప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది.
తల్లి మరణంతో ఎమ్మెల్యే…. తండ్రి మరణంతో మంత్రి అయ్యారు అఖిలప్రియ. ఎలాంటి రాకీయ అనుభవం లేకపోయినా అనుహ్యంగా బాబు అఖిలకు మంత్రి పదవి కట్టబెట్టారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలోనె బాబు మంత్రి పదవి ఇచ్చారనె వార్తలు బలంగా వినిపించాయి. భూమా నాగిరెడ్డి మంత్రి కాకుండానె మరణించారని వార్తలు వినిపించాయి. అయితే భూమా నాగిరెడ్డి గెలుపొందిన నంద్యాల నియేజక వర్గంనుంచె భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు కాబట్టి మంత్రి పదవి ఇస్తె భూమా కోరిక కొంత వరకు నెరవేరినట్లే అనే ఊహగానాలు వినిపిస్తునాయి…..