వైసీపీ ప్లీనరీ సక్సెస్ కావడంతో బాబు గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.మంత్రులను,నాయకులను నమ్ముకుంటె పుట్టిమునగడం ఖాయమనే సంకేతాలు వెలువడటంతో టీడీపీ గేరు మార్చి స్పీడ్ పెంచింది.ప్లీనరాలో జగన్ ఇచ్చిన 9 పథకాలను ప్రకటించిన వెంటనే సీఎం రూటు మార్చారు.జగన్ పాద యాత్రకు పోటీగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ప్లీనరీలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 27వ తేదీ నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కంగుతిన్న బాబు జగన్ కన్నా ముందే ‘ఇంటింటికి టిడిపి’ కార్యక్రమాన్ని మొదలుపెట్టేయాలని చంద్రబాబు మంత్రులకు,నాయకులను ఆదేశించారు.
విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ఆదాయాలు పెంచటానికి తాను చేస్తున్న కృషి, ప్రత్యేకించి రుణమాఫీలు, రాజధాని నిర్మాణానికి తీసుకుంటున్న చొరవ తదితరాలను జనాలకు విడమరచి చెప్పాలని మంత్రులు, నేతలను ఆదేశించారు. వివిధ వర్గాలకు గత ప్రభుత్వాలేం చేసాయి, టిడిపి ఏం చేస్తోందన్న విషయాలను విడమరచి చెప్పాలని చెప్పారు.
మూడేళ్ళ అభివృద్ధిని సెప్టెంబర్ 17వ తేదీ నుండి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో వివరించి చెప్పాలని చెప్పారు. ప్రతీ జిల్లాలోని గ్రామాలను టచ్ చేయాలన్నారు. తాను ప్రత్యేకంగా కళాశాల విద్యార్ధులతో సమావేశాల నిర్వహించనున్నట్లు కూడా చెప్పారు.
ప్రతీ నియోజకవర్గంలోనూ కార్యక్రమం ఖచ్చితంగా అమలు కావాలని ఆదేశించారు. పదవులు పొందిన వారిలో చాలామంది ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని, కార్యక్రమాల గురించి ఏమాత్రం ప్రచారం చేయటం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు.
ప్రతీ జిల్లాలోనూ ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రితో పాటు ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీలందరూ తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పారు. జగన్ పాదయాత్రకన్నా ముందే ఇంటింటికి టిడిపి కార్యక్రమం జనాల్లోకి వెళ్ళాలన్నది చంద్రబాబు ఆలోచన.అవసరం అయితే అన్ని జిల్లాల్లో యాత్ర చేపడతానని బాబు సెలవిచ్చారు.
- Advertisement -
ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని కాపీ కొట్టిన బాబు…
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -