వైఎస్ జగన్ పాత పగలు, కక్షలు అన్నీ మరిచిపోతున్నాడు. తన ప్రత్యర్థులను, తీవ్రంగా విమర్శించిన వారిని తన ప్రమాణ స్వీకారానికి పిలుస్తూ అందరి మనసు చూరగొంటున్నారు. ఫోన్ చేసి వారి మనసును ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించిన జగన్ తాజాగా దేశంలోని, రాష్ట్రంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపారు.
ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ లకు జగన్ ఆహ్వానించడం విశేషం. చిరుకు ఫోన్ చేసి ముందుగా బాగోగులు అడిగి సరదాగా మాట్లాడిన జగన్ అనంతరం మీ సహకారం భవిష్యత్ లో అవసరమని..మీరు సతీసమేతంగా నా ప్రమాణ స్వీకారానికి రావాలని కోరినట్టు తెలిసింది. దీనికి చిరంజీవి తప్పకుండా వస్తానని చెప్పినట్టు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ను కూడా ఫోన్ చేసి ఈ ఎన్నికల్లో మీరు బాగా పోరాడారని.. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు అని.. ప్రమాణ స్వీకారానికి రండి అంటూ జగన్ ఆహ్వానించినట్టు తెలిసింది. పవన్ సైతం తాను వస్తానని చెప్పినట్టు తెలిసింది.
ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు సీపీఐ,సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డిలను, రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలను కూడా వైఎస్ జగన్ ఆహ్వానించారు.
ఇక జాతీయ స్థాయిలో బీహార్ సీఎం నితీష్ కు ఫోన్ చేసి రావాలని కోరారు. డీఎంకే అధినేత స్టాలిన్ ను ఆహ్వానించారు. తనను ఎన్నికల్లో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ను కూడా ఆహ్వానించారు. ఇక ఇప్పటికే మోడీ, అమిత్ షా, కేసీార్ లను జగన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే..ఇలా ప్రమాణ స్వీకారం వేళ అందరినీ సమదృష్టితో చూస్తూ జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడం సంచలనంగా మారింది.