Friday, May 3, 2024
- Advertisement -

ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం జగన్..!

- Advertisement -

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కార్యక్రమం పేరిట ప్రజల ఖాతలో ఎంత మొత్తం వేస్తున్నా.. కొందరు మంత్రులు, మేజరిటీ ఎమ్మెల్యేల చర్యలతో జగన్ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుందన్న టాక్ వస్తోంది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాడి ఇప్పటికే ఏడాదిన్నర అవుతోంది. ఇటీవలే మార్పుల నేపథ్యంలో జగన్ తన క్యాబినేట్ లో ఇద్దరు కొత్త మంత్రులకు చోటు కలిపించారు. ఎప్పటికప్పుడు జగన్ తన మంత్రులను అప్రమత్తం చేస్తున్న వారిలో కొందరు మాత్రం చేయి తడపందే పని కావ్వట్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట.

తాజాగా వైసీపీ ప్రభుత్వం మంత్రుల పనితీరు ఎలా ఉన్నది అన్నదానిపై చెన్నైకి చెందిన ఓ ప్రైవేటు ఏజన్సీతో సర్వే చేయించిందట. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను చూస్తే దారుణంగా ఉన్నాయని వైసీపీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు జగన్ కొత్తవాళ్లతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు ఇవ్వగా.. వారు కూడా ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈ కొత్త నేత్తల్లో చాలా మందికి నియోజకవర్గంలో క్యాడర్ మీద అధికారాల మీద ఏ మాత్రం పట్టు లేదట. మరి కొంత మంది తాము ఎమ్మెల్యే అయిపోయాం ఇక చాలు.. అంత తాము చెప్పినట్లు జరగాలి.. తమ వాట తమకు ఇచ్చేస్తే చాలు అన్నట్లుగా వసూళ్ళు మొదలు పెట్టేశారట.

మరికొందరు యువకులు, రాజకీయ అనుభవం లేని వాళ్ళు అర్ధికంగా స్థితిమంతులు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో వీరికి ప్రజల ఇబ్బంది, నియోజకవర్గం అభివృద్ధి పట్టడం లేదట. కేవలం ఎమ్మెల్యే స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నవారు కొందరు అయితే మరికొందరు వసూళ్లకు పాల్పడుతూ డబ్బు ఇచ్చినవాళ్లకే పనులు చేస్తున్నారని తేలిందట. ఇలాంటి ఎమ్మెల్యేల చర్యలతో నియోజకవర్గాల్లో ఐదు, పదేళ్ళుగా పని చేస్తున్న నాయకులు వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. కొందరు మంత్రులు సైతం క్యాష్ ఇస్తే టకటక పనులు చేస్తారన్న మాట తెలిసిందట. వీరి వల్ల ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో డ్యామేజ్ అయింది అంటున్నారు. ఈ సర్వే ఓ సీనియర్ మంత్రి, ఒక ఎంపీ.. ఇద్దరు కలిసి చేయించారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నివేదిక జగన్ దగ్గరకు వెళ్లడంతో ఈ ఎమ్మెల్యేల్లో కొందరికి జగన్ వార్నింగ్ కూడా ఇచ్చారని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -