2019 సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ, వైసీపీ, జనసే పార్టీలు సిద్దమవుతున్నాయి. అభ్యర్తుల ఎంపిక, ప్రకటనలు, అసంతృప్తులపై దృష్టిసారించారు. అసలు విషయానికి వస్తే అన్ని రాజకీయాలు, సినిమా రంగాన్ని వేరుగా చూడలేం. ఎందుకంటే రెండూ కలసిపోయాయి. అన్ని పార్టీలకు సినీ తారల మద్దతు పెద్ద ఎత్తున ఉంది. జనసేనకు పవనే బ్రాండ్ అంబాసిడర్. ఇక టీడీపీ విషయానికి వస్తే సినిమా తారల మద్దతు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక వైసీపీ కూడా సినీ గ్లామర్ బాగానే ఉంది. అయితే పాదయాత్రలో సినీ నటుడు ఆలీ జగన్ను కలిసిన ఫోటో సోషియల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వివిధ రకాల భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం శ్రీకాకులం జిల్లాల్లో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో జగన్ను కలసిన అలీ వ్యక్తిగతంగా గంటసేపు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న మద్దతు, జగన్ ఆరోగ్య సమస్యలు, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిపై కూడా చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు జగన్ పాదయాత్రపై అలీ ప్రశంశలు కురపించారు. నిత్యం ప్రజల్లో ఉండాలనే తపనతో ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని పొగడ్తలతో ముంచెత్తారంట. ఇకపోతే వైఎస్ జగన్ కు సినీ రంగం నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. వారం రోజుల క్రితం సినీనటుడు భానుచందర్, కృష్ణుడులు వైఎస్ జగన్ ను పాదయాత్రలో కలిశారు. ఇక పృథ్వీ గురించి చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకీ జగన్కు సినీ తారల మద్దతు లభించడం ఆపార్టీకి మేలు చేసే అంశం.
అయితే వీరిద్దరి కలయికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి. అలీ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అలీ వైసీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జగన్ పాదయాత్రకు సినీ నటులు సంఘీభావం తెలపడం కామన్. మరో వైపు జవన్కు కూడా అలీ మంచి స్నేహితుడు. మరి అలీ వైసీపీనుంచి పోటీ చేస్తాడా లేకా జనసేన నుంచి పోటీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగ వచ్చు. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే వేయిట్ అండ్ సీ.