Monday, April 29, 2024
- Advertisement -

కాల్ రికార్డ్ పై పృథ్వి మళ్లీ కామెంట్స్.. ఈ సారి ఇలా..!

- Advertisement -

కమెడియన్ పృథ్వి.. రీల్ లైఫ్ లో బానే రాణించాడు కానీ రియల్ లైఫ్ లో రాణించలేక విమర్శలు ఎదుర్కుంటున్నాడు. గత ఎన్నికలకు ముందు పృథ్వి వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ తరుపున ప్రచారం చేశాడు. తర్వాత జగన్ పృథ్వికి ఎస్వీబిసి చైర్మన్ పదవి కట్టబెట్టారు.

అంతా బానే ఉందనుకున్న టైంలో పృథ్వి వివాదంలో చిక్కుకున్నాడు. ఎస్వీబిసి మహిళా ఉద్యోగినితో పృథ్వి మాట్లాడిన సంభాషణ బయటకు లీక్ అయింది. దాంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో పృథ్వి చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ఆడియోకి తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పుడు చెప్పుకొచ్చాడు పృథ్వి. కానీ తాజాగా పృథ్వి సోషల్ మీడియాలో మాట్లాడుతూ నోరు జారాడు. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికే తెలుసు.

అనేక రిపోర్ట్స్ లో నాకు క్లీన్ చిట్ వచ్చింది. కానీ కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. నేనేదో వెనుక పట్టుకో ముందు పట్టుకో అన్నానట. అసలు దానికే లేని దురద మీకెందుకురా.. అది నవ్వుతూ మాట్లాడింది అంటూ పృథ్వి సంచలన కామెంట్స్ చేశాడు. పృథ్వి కామెంట్స్ చూస్తుంటే.. అతడు మహిళా ఉద్యోగినితో మాట్లాడింది నిజమే అని అనిపించేలా ఉన్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ పృథ్వి నిజం ఒప్పేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -