కర్నూలు జిల్లా రాకీయాలు ఆసక్తికరంగా మారాయి. కోట్ల ప్యామిలీ పార్టీ మారుతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలోకి ఎంట్రీ ఖాయం అయ్యిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ మారడంలేదని క్లారిటీ ఇచ్చిన ఊహాగానాలు ఆగడంలేదు. అయితే ఇప్పుడు తాజాగా కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కోట్లు వ్యాఖ్యలు పలు ఆసక్తి కరంగా మారాయి. బాబు తన ఇంటికి వస్తారని …ముందుగా పోలీసులు తనకు సమాచారం ఇచ్చారన్నారు. అయితే ఏజరిగిందో తెలియదు కాని సీఎం తన ఇంటికి రాలేదని కోట్లు చెప్పారు.
అసక్తికర విషయం ఏంటంటె సీఎం తన ఇంటికి వచ్చి పార్టీలో చేరమని అడిగినా తాను కాంగ్రెస్ పార్టీని వీడె వాడిని కానని కోట్లు చెప్పారు. గత కొంతకాలంగా పార్టీ మారుతున్నారనె వార్తలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు ఖండస్తూ వస్తూనె ఉన్నారు.
మరో సారి కాంగ్రెస్ పార్టీని వీడె ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. వ్యవసాయం చేసుకొనైనా బ్రతుకుతానని పార్టీ మారనని ఖరాఖండీగా చెప్పారు. టీడీపీలోకి రావాలని తన ఇంటికి బాబు వచ్చి ఆహ్వానించినా ఇదే మాట చెప్పేవాడినన్నారు. ఇప్పటికైనా పార్టీ మారుతున్నారనె వ్యాఖ్యలకు పుల్స్టాప్ పడుతుందో చూడాలి.