Monday, May 6, 2024
- Advertisement -

టీఆర్ఎస్‌పై మ‌రో బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అధికార‌, మ‌హాకూట‌మి నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాల్లా పేలుతున్నాయి. మ‌రో వైపు టీఆర్ఎస్ పార్టీనీ ఒత్తిడిలోకి నెట్టేందుకు రేవంత్ రెడ్డి మైండ్ గేమ్‌ను మొద‌లు పెట్టారు. కొద్ది రోజుల క్రితం పార్టీనుంచి సీనియ‌ర్ నేత‌లు కాంగ్రెస్ లోకి వ‌స్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ హ‌రీష్ రావును టార్గెట్ చేశారు.

తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో సిరిసిల్లో ఏర్పాటు చేసిన స‌భ‌లో భాగంగా రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు గులాబీ పార్టీలో అల‌జ‌డిని రేకెత్తిస్తున్నాయి. కేసీఆర్‌, కేటీఆర్‌లు ఓడిపోవ‌డ‌మే హ‌రీష్ రావుకు ముఖ్య‌మ‌ని బాంబు పేల్చారు. వారిద్దరూ ఓడిపోతే టీఆర్ఎస్ పగ్గాలు తన చేతిలోకి వస్తాయని హరీష్ భావిస్తున్నారని… అందుకే కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోవాలని చూస్తున్నారని అన్నారు.

గ‌జ్వేల్‌లో కీసీఆర్‌ను ఓడించాల‌ని మ‌హాకూట‌మి అభ్య‌ర్తి ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డితో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని వెల్ల‌డించారు. బతుకమ్మ చీరలు సిరిసిల్లలో కాకుండా సూరత్ లో కొనుగోలు చేశారని రేవంత్ ఎద్దేవా చేశారు. నేరెళ్లలో ఇసుక మాఫియాకు ఎదురు తిరిగిన ఎస్సీలను హింసించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలు ఆగలేదని విమర్శించారు. తెలంగాణ పరిస్థితిని చూసి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తన కన్నీళ్లను కళ్లలోనే దాచుకున్నారని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -