ఓటుకునోటు కుసు విషయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఆయన ఇళ్లు, కార్యాలయాలపై రైడ్ చేసి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డిని కూడా ఐటీ అధికారులు విచారించారు. తాజాగా తెలంగాణా డీజీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డిపై తనకు నమ్మకం లేదని…అందుకే రాష్ట్రపోలీసులతో కాకుండా కేంద్ర సెక్యూరిటీ సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘాన్ని రేవంత్రెడ్డి కోరారు.నాగార్జునసాగర్ లో గతంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ శిక్షణలో ఆయన పాల్గొన్నారని… అందుకే ఆయనపై నమ్మకం లేదని చెప్పారు.
సభలోనే ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహిస్తారని అన్నారు. తనను భౌతికంగా అంతమొందిస్తామని టీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్ లు హెచ్చరించారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే రూ. 10కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారంటూ నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లానని రేవంత్ తెలిపారు.