Wednesday, May 15, 2024
- Advertisement -

చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్‌…టీడీపీలోకి స‌బ్బం హ‌రి..

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది ఏపీలో రాజ‌కీయ వేడి పెరుగోతోంది. అన్ని పార్టీల‌ల్లోకి చేరిక‌లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుత‌న్నాయి. విభ‌జ‌న త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయిన కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు టీడీపీ గూటికి చేరుకుంటున్నారు. అలాంటి వాళ్లంద‌రికి టీడీపీ పున‌రావాసం క‌ల్పిస్తోంది.

తెలంగాణాలో మాదిరి ఏపీలో కూడా కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు ఉంటుంద‌న్న సంకేతాల నేప‌ధ్యంలో రాజ‌కీయ భ‌విష్య‌త్తుకోసం టీడీపీలో చేరుతున్నారు ఈతాజా మాజీ కాంగ్రెస్ నేత‌లు. తాజాగా మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడు స‌బ్బం హ‌రి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం అయ్యింది. అమ‌రావ‌తిలో బాబును క‌ల‌సి ఆయ‌న పార్టీలో చేరుందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు బాబుకు త‌న మ‌న‌సులోని మాట చెప్పారంట‌. ఇంకేముంది బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంటు సీటు కానీ, విశాఖ నార్త్ అసెంబ్లీ టికెట్ కానీ కేటాయించాలని సీఎంను కోరారు.

టీడీపీలో చేరుతానన్న సబ్బం హరి ప్రతిపాదనకు పార్టీ అధినేత చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఏపీ విభజన తర్వాత సబ్బం హరి కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొద్ది నెల‌లుగా బాబుకు అనుకూలంగా మాట్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన వైసీపీలో చేరుతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే స‌బ్బం హ‌రిక జ‌గ‌న్ నో బోర్డు పెట్ట‌డంతో ఇప్పుడు టీడీపీ గూటికి చేరుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -