భారత రక్షణ, పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) రూపొందించిన వాటిలో అత్యంత శక్తిమంతమైంది బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆపరేషన్ నిర్వహించగల సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకత. గతంలో 298 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి సామర్థ్యాన్ని.. ఇటీవలే 450కి.మీకు పెంచింది డీఆర్డీఓ.
ప్రస్తుతం చైనా, పాకిస్థాన్తో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తన సత్తా ఏంటో శత్రు దేశాలకు చూపాలని భావిస్తోంది భారత్. ఇందులో భాగంగానే హిందూ మహాసముద్రంలో ఈ నెల చివరి వారంలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణితో పలు పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. భారత త్రివిధదళాల సారథ్యంలో వీటిని చేపట్టనుంది.
నవంబర్ నెల చివరి వారంలో ఈ ప్రయోగాలు జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఫలితంగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలవుతుందని పేర్కొన్నాయి.
ఉగ్రవాదులు ఏక్కడ దాక్కున్నా.. ఏరి పారేస్తాం : ప్రధాని మోదీ