పార్టీ ఫిరాయించిన ఎమ్మేల్యేలకు వారి నియోజక వర్గాల్లో ప్రజలుచుక్కులు చూపిస్తున్నారు. వైసీపీ తరుపున గెలిచి మంత్రిపదువులు, కాంట్రాక్లులు, డబ్బులకు అమ్మడుపోయిన నేతలకు కష్టాలు ఎదురవుతున్నాయి. నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబే రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు అయితే సంతోషంగా ఉన్నారు. ..కాని ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలనుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి నియోజక వర్గంలో ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. నియోజకవర్గాల్లో పలు విధాలుగా నిరసన తెలుపుతున్న ప్రజలు మరో ముందడుగు వేసి కోడిగుడ్లును అశోక్రెడ్డిమీదకు విసిరారు. ఒక్కసారిగా తమలో ఉన్న ఆగ్రహం కట్టులు తెంచుకోవడంతో గుడ్లతో దాడిచేయడంతో అక్కడున్న వాల్లంతా అవాక్కయ్యారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి – వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ పరాభవానికి గురయ్యారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని అశోక్రెడ్డి అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామంలో చేపట్టారు. అక్కడ నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరేశారు. దీంతో సభలో కలకలం రేగింది.
ఎమ్మెల్యే లక్ష్యంగా కోడిగుడ్ల దాడి చేసిన ఘటనపై అక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరులు పలువురిని అనుమానించి వారిపై చేయిచేసుకున్నారు. తమ గ్రామంలో సభ పెట్టి…తమ ఊరి వారినే అనుమానించడం..దాడి చేయడం ఏమిటని గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.