- Advertisement -
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్వాగతించినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. జో బైడెన్ను అమెరికా తదుపరి అధ్యక్షుడిగా అంగీకరించిన తొలి దిగ్గజ సాంకేతిక సంస్థ అధిపతిగా నిలిచారని పేర్కొంది.
నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించిన విషయం స్పష్టమైందని జుకర్బర్గ్ తన సంస్థలోని ఉద్యోగులకు చెప్పారని బజ్ఫీడ్ అనే వార్తా సంస్థ పేర్కొంది.
ఎన్నికల ఫలితాలపై కొంత మంది న్యాయపోరాటానికి మొగ్గుచూపుతున్నారని, రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని జుకర్బర్గ్ పేర్కొన్నారు. ఇది వారి హక్కు అని చెప్పారు. అయితే రీకౌంటింగ్తో పెద్దగా ఉపయోగం లేదని అన్నారు. ‘ముందస్తు అంచనాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని కొంతమంది అనుకుంటున్నారు.
ట్రంప్ 232.. డెమొక్రాట్ కి 306.. నయా లెక్కలు..!