అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా అలస్కాలో వెలువడిన ఫలితాల్లో ఆయన విజయం సాధించారు. తన ఎలక్టోరల్ సంఖ్యను 217కు పెంచుకున్నారు.
అలస్కాలో ట్రంప్ 56.9శాతం ఓట్లు సాధించారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్ 39.1శాతం ఓట్లు మాత్రమే పొందారు. అయితే ఈ విజయం జోబైడెన్ అధ్యక్షుడయ్యే అవకాశాలపై ఏమాత్రం ప్రభావం చూపదు. ఇప్పటికే బైడెన్ అధికారానికి కావాల్సిన 270 కంటే ఎక్కువ ఓట్లనే సాధించారు.
మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో జార్జియాలో పోలైన ఓట్లను తిరిగి లెక్కించనున్నట్లు రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జియా మంత్రి బ్రాడ్ రాఫెన్స్పెర్గర్ ప్రకటించారు. ట్రంప్ కంటే ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్ కేవలం 14 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నందున ఓట్ల లెక్కింపును మొదట్నుంచి మళ్లీ చేతులతో లెక్కించేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు.
దేశంలోనే జగనన్న బెస్ట్ సీఎం..!
టీఆర్ఎస్ వ్యూహాన్ని మార్చే టైం వచ్చిందా..?
టీడీపీ చేతుల్లోంచి ఆ వర్గాన్ని తెలివిగా లాక్కున్న వైసీపీ..?
టీడీపీ కి వెళ్ళిన వైసీపీ నేతలకు తగిన శాస్తి జరుగుతుంది గా..?