- Advertisement -
చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్లను పోల్చుతూ ఇద్దరి మద్యనున్న తేడాలను వవరిస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బాబుకే అడ్వాంటేజ్ అధికంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉందని గుర్తు చేస్తూ, ఆ సమయానికి ఏదైనా జరగవచ్చని చెప్పారు.
జగన్ వద్ద ఎలక్షన్ మేనేజ్మెంట్ శక్తి లేదని, ఆయన వద్ద ఆ పనిని సమర్థవంతంగా చేసిపెట్టగల వారు ఎవరైనా ఉన్నారా? అన్న విషయం తనకు తెలియదని ఉండవల్లి చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు సైతం జగన్ కు అడ్వాంటేజ్ ఉందని అందరూ భావించారని, అయితే చివరి నెలన్నర రోజులూ చంద్రబాబు పన్నిన వ్యూహాలు ఫలితాలను మార్చి ఆయనకు అనుకూల ఫలాన్నిచ్చాయని చెప్పారు.
చంద్రబాబును ఎదుర్కునే సత్తా జగన్ కు లేదు” అని తాను అన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.