జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. తాజాగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ జోరు చూపిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ 71 స్థానాల్లో ముందంజలో ఉంది.
బీజేపీ 33, ఎంఐఎం 37, కాంగ్రెస్ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. కమలం పార్టీ గ్రేటర్లో ఖాతా తెరిచినట్టు అయ్యింది… ఇక, అధికార టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తోంది బీజేపీ… ఎల్బీనగర్, మహేశ్వరం, గోషామహల్ అసెంబ్లీ నియోకవర్గాల పరిధిలోని డివిజన్లలో క్లీన్ స్వీప్ చేస్తామని లెక్కలు వేస్తున్నారు. మొత్తంగా.. గతంలో పోలీస్తే గ్రేటర్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. అధికార పార్టీ సైతం దూసుకు వెళ్లింది.
Also Read
నాన్న హయంలో ఇవాంక ట్రంప్ నిధులు దుర్వినియోగం..?
మంచి టీచర్ : గ్లోబల్ టీచర్స్ ప్రైజ్మనీ-2020