Saturday, April 27, 2024
- Advertisement -

గ్రేటర్ షాక్.. బీజేపీ గూటికి టీఆర్ఎస్ కీలక నేత?

- Advertisement -

గ్రేటర్ ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కన్నా పెద్ద స్టంట్ గా మారింది. ఏ నాయకుడు ఏ పార్టీ వైపు వెళ్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తాజాగా ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ కి పెద్ద షాక్ తగిలింది. శాసనమండలి మాజీ చైర్మెన్,టి‌ఆర్‌ఎస్ సీనియర్ నేత అయిన స్వామి గౌడు బి‌జే‌పి తీర్థం పుచ్చుకున్నారు.

బుధవారం టి‌ఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పి భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. స్వామి గౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల వేళ సీనియర్ నేత పార్టీ మారడంతో టి‌ఆర్‌ఎస్ కు గట్టి షాక్ తగిలినటైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -