Wednesday, April 24, 2024
- Advertisement -

పార్టీ మారకపోతే విడాకులు ఇస్తా..!

- Advertisement -

ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్​లో చేరిన బిజేపి ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాతా మండల్.. కాషాయ దళంపై తీవ్ర విమర్శలు చేశారు. ముమ్మారు తలాక్​ రద్దు చేసిన పార్టీనే.. విడాకులు ఇవ్వాలని తన భర్తను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పార్టీ మారినందుకే విడాకులు ఇస్తానని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యక్తిగత గౌరవం, భద్రతను దృష్టిలో ఉంచుకొనే టీఎంసీలో చేరినట్లు మండల్ తెలిపారు. బిజేపిలో ఎలాంటి డిమాండ్లు చేయలేదని స్పష్టం చేశారు. ఆ పార్టీలో తనకు సరైన మర్యాద లభించలేదని వెల్లడించారు. భార్యకు ఎందుకు విడాకులు ఇస్తున్నారని ఏ భాజపా నేత సౌమిత్రను అడగడం లేదని ఆక్షేపించారు.

వ్యక్తిగత జీవితంలో రాజకీయాలు ప్రవేశించడం ఆ బంధానికి మంచిది కాదు. భాజపాలోని చెడు వ్యక్తులతో సౌమిత్ర సహవాసం చేస్తున్నారు. ఆయన్ను నాకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారు. ముమ్మారు తలాక్​ను నిషేధించిన పార్టీనే.. ఇప్పుడు నాకు విడాకులు ఇవ్వాలని సౌమిత్రను అడుగుతోంది.నేను ఇప్పటికీ సౌమిత్రను ప్రేమిస్తున్నా అని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -