రాయలసీమలో పాదయాత్ర విజయవంతం అవ్వటంతో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలో ఆత్మ విశ్వాసం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఏజిల్లాలో చూసినా పాదయాత్రకు అన్ని వర్గాలనుంచి అనూహ్యమద్దతు లభించడంతో జగన్ మరింత ఉత్సాహంతో ముందుకెల్తున్నారు.
తాజాగా నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. అక్కడ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరో పది రోజులు ఈ జిల్లాలోనే జగన్ పాదయాత్ర కొనసాగనుంది. జగన్కు వస్తున్న ఆదరనను చూసి అధికారపార్టీ చేస్తున్న విమర్శలు తెలసిందే. అయితే తాజాగా బాబు, పవన్కు దిమ్మతిరిగిపోయో పంచ్ ఇచ్చారు జగన్.
పాదయాత్రలో మంచి జోష్ లో ఉన్న జగన్ బుధవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమ ముందు ఏ సేన కూడా నిలబడలేందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జనసేన చీలుస్తుందా అన్న ప్రశ్నకు జగన్ పై విధంగా స్పందించారు. ‘జనసేనే కాదు ఏ సేన కూడా తమ ముందు నిలవలేంద’న్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలక వస్తుందని అనుకోవటం లేదని గట్టిగా చెప్పారు.
జనాలందరూ మూడున్నరేళ్ళ చంద్రబాబునాయుడు పాలనపై బాగా విసిగిపోయున్నట్లు చెప్పారు. జనసేన-చంద్రబాబు ఒకటే అన్న విషయాన్ని జనాలు గ్రహించినట్లు తెలిపారు. మూడున్నరేళ్ళ క్రితం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణాన్ని జనాలు వచ్చే ఎన్నికల్లో వదిలించేస్తారంటూ చెప్పారు.