Thursday, May 16, 2024
- Advertisement -

ప్రజలను రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర

- Advertisement -
అప్పుడప్పుడూ ప్రజల్లోకి వచ్చి ఊగిపోతూ ఉపన్యాసాలు ఇచ్చేస్తూ, మళ్లీ ఆరు నెలల వరకూ అడ్రస్ లేకుండా పారిపోయే పవన్ ఈ సారి భారీ కుట్రతో ప్రజల్లోకి వచ్చాడని అర్ధమైపోతోంది. మొన్న బుధవారం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అత్యంత దారుణమైన పదజాలం వాడిన పవన్ నిన్న గురువారం టీడీపీతో పాటు వైఎస్ఆర్ సీపీ నేతలనూ టార్గెట్ చేశాడు. చింతమనేని తల తీస్తాం, కాళ్లు, కీళ్లు విరగ్గొడతాం, అగ్నిగుండం సృష్టిస్తా, నేనే కత్తి పట్టుకుంటాను… అంటూ ఓ వీధి రౌడీ కంటే దారుణమైన భాష వాడిన పవన్ మళ్లీ అదే రేంజ్ లో రెచ్చిపోయాడు. జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని కాళ్లు విరగ్గొడతాం… అంటూ పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గణపవరంలో మాట్లాడాడు. అసలు పవన్ వాడే భాష  వింటుంటే సామాన్యులకు భయమేస్తోంది. కొన్ని వేలమందిని ప్రభావితం చేయగలిగే స్థానంలో ఉన్న సీనియర్ సినీనటుడు, రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎవడైనా అలాంటి భాష మాట్లాడుతాడా ? ఓ నియంతలా, ఓ ఉన్మాదిలా ఆ వార్నింగులు ఏంటని ప్రజల్లో చర్చ జరుగుతోంది. తమ వాళ్లను వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, కోర్టుకు వెళ్లాలి, అంతేకానీ ఇలా తల తీస్తాం, కాళ్లు విరగ్గొడతాం అంటూ బెదిరింపు రాజకీయాలు చేయడం చూస్తుంటే పవన్ పెద్ద కుట్రతోనే ప్రజల్లోకి వచ్చాడని తేలిగ్గానే అర్ధమవుతోంది.
ఆ మధ్య బీజేపీ వాళ్లు ఆపరేషన్ గరుడ మ్యాప్ వేశారని, ఏపీలో విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చుపెట్టి, ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగేలా భారీ విధ్వంసానికి వ్యూహరచన చేశారనే ఆరోపణలు బలంగా వచ్చాయి. ఏపీలో పాగా వేయాలంటే దశాబ్దాలుగా పాతుకుపోయిన టీడీపీని కూకటివేళ్లతో పెకలించాలని బీజేపీ ప్లాన్. చంద్రబాబు సీఎం సీటులో ఉండగా అది తమ వల్ల కాదు. అందుకే పవన్ కళ్యాణ్ ద్వారా ఆపరేషన్ గరుడ అమలు చేయాలని వ్యూహం పన్నారని, ఏదో ఓ వంకతో శాంతిభద్రతలు అదుపు తప్పేలా, రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చాలన్నదే వారి వ్యూహమని ప్రధాన ఆరోపణ. అందుకు పావుగా పవన్ కళ్యాణ్ ను వాడుతారని సినీనటుడు శివాజీ ఇప్పటికే చెప్పారు. ఆయన చెప్పిన ఆరోపణలు ఇప్పుడు పవన్ నిజం చేయడానికే మళ్లీ ప్రజల్లోకి వచ్చి రౌడీలా మాట్లాడుతున్నాడనే అనుమానాలు కలుగుతున్నాయి. తల తీస్తాం, కాళ్లు విరగ్గొడతాం. కత్తి పట్టుకుంటాను…అంటూ పార్టీల మధ్య, ప్రజల మధ్య అగ్గి రాజేస్తున్నాడు పవన్. ఈయన నోటికొచ్చినట్లు మాట్లాడేసి, రెచ్చగొట్టేసి తనదారిన తాను వెళ్లి ఏసీ రూముల్లో రిలాక్సయిపోతాడు. ఇక్కడ ఆయన మాటల ప్రభావంతో, ప్రజల మధ్య విద్వేషాలు పెరిగిపోయి, కత్తులు దూసుకుని, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, ఆస్తి నష్టాలు చోటు చేసుకుని, తీవ్ర విద్వేషాలతో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయి. పాలన గాడి తప్పుతుంది. మరోవైపు ఈ లోగా మోడీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తుకు సిద్ధమవుతున్నారు. అదే సమయానికి ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం పేరుతో ప్రభుత్వాన్నిరద్దు చేయాలనే డిమాండ్లను మళ్లీ పవన్, బీజేపీ నేతలే చేస్తారు. దీంతో అసెంబ్లీ రద్దు,ఎన్నికలు, బాబు వ్యూహాలకు చెక్ పెట్టడం వగైరా వగైరా పవన్ అండ్ బీజేపీ నేతల స్కెచ్ అని, ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనని అనేక అనుమానాలు వస్తున్నాయ.
ప్రత్యేకహోదా ఇస్తామని మోసం చేసిన మోడీని నాడు నెత్తిన పెట్టుకుని ఊరేగిన పవన్ నేడు ఆయన మోసం చేస్తుంటే అన్నీ మూసుకుని కూర్చున్నాడు. ప్రశాంతంగా ఉన్న ఏపీలోకి ఆరు నెలలకోసారి వచ్చి తల తీస్తాం. కాళ్లు కీళ్లు విరగ్గొడతాం అంటూ ఉన్మాదులు, ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతున్నాడంటే అర్ధమేంటి ? ఓ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, బాధ్యత కలిగినవాడు ఎవడైనా అలా మాట్లాడుతాడా ? ప్రజలను రెచ్చగొట్టి, భారీ విధ్వంసానికి కుట్ర చేయడంలో భాగంగానే పవన్ అలాంటి రౌడీల లాంగ్వేజ్ వాడుతున్నాడని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. మీ అభిప్రాయం కూడా అదే అయితే ఓ లైక్ కొట్టండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -