Wednesday, May 8, 2024
- Advertisement -

ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

- Advertisement -

గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయాలు మహా వాడీ వేడిగా సాగుతుంది. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ వరుసలో మరికొంత మంది ఉండబోతున్నాని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగదీశ్ రెడ్డి కుమారుడి పుట్టిన రోజు వేడుకలను హంపిలో జరిపినట్టు, ఆ వేడుకలకు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనలపై ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అందులో పేర్కొంది. ఇప్పుడు ఈటెల.. తర్వాతి వేటు పడేది జగదీశేనా? అన్న కోణంలో వార్తను ప్రచురించింది. దీనికి సంబంధించింది రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. చెత్త మనుషులకు, చెత్త ఆలోచనలే ఉంటాయని కొట్టిపారేశారు. అలాంటి విషయాలపై తాను స్పందించాల్సిన అవసరంలేదని కొట్టిపారేశారు. బుధవారం జగదీశ్ రెడ్డి ఓ న్యూస్ ఛానెల్‌తో ఈ మేరకు మాట్లాడారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించామని, త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో కరోనాకు మెరుగైన చికిత్స అందుతోందన్నారు.

కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందని జగదీష్‌రెడ్డి మరోసారి చెప్పారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఓ ఆంగ్ల పత్రిక కథనం ట్వీట్ చేస్తూ.. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’.. కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం.. యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా? అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైనే మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -