Friday, May 17, 2024
- Advertisement -

స‌రైన స‌మ‌యంలో లోకేష్ అవినీతిపై ఆధారాలు బ‌య‌ట‌ పెడ‌తా ప‌వ‌న్‌..

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, మంత్రి లోకేష్‌ల‌మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. గుంటూరులో జ‌రిగిన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో లోకేష్‌పై ప‌వ‌న్ చేసిన అవినీతి ఆరోప‌న‌లు తెలిసిందే. అప్ప‌టినుంచి టీడీపీ ,జ‌న‌సే మ‌ధ్య మాట‌ల పోరు మొద‌ల‌య్యింది. లోకేష్‌పై ప‌వ‌న్ చేసిన ఆరోప‌న‌ల‌పై మంత్రి స్పందించారు.

మకు పవన్ కల్యాణ్ సర్టిఫికేట్ అవసరం లేదని… ఏపీ ప్రజలకు ఎవరేంటో తెలుసని చెప్పారు. పవన్ దిగజారుడు రాజకీయాలు బాధాకరమని… ఆయన వద్ద తన ఫోన్ నంబర్ ఉందని… ఏవైనా ఆధారాలు ఆయన వద్ద ఉంటే నేరుగా తనకే ఫోన్ చేసి ప్రశ్నించి ఉండొచ్చుకదా? అని అన్నారు. తాము ప్రతి ఏటా ప్రకటిస్తున్న ఆస్తుల కన్నా చిల్లిగవ్వ ఎక్కువున్నా తీసుకోండని చెప్పారు. ప‌వ‌న్‌పై ప‌రువు న‌ష్టం కేసు పార్టీ చూసుకుంటుంద‌ని తెలిపారు లోకేష్‌.

తాజాగా ఒ నేష‌న‌ల్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్యూలో లోకేశ్‌ అవినీతి వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవే ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారాయి. లోకేశ్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఏ ఆధారాలు లేకుండా లోకేశ్‌ గురించి ఎందుకు మాట్లాడుతానని పవన్‌ ప్రశ్నించారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతానని వెల్లడించారు.

బీజేపీ, టీడీపీ నుంచి ఏమీ ఆశించానో అవి నెరవేర్చలేదని అన్నారు. వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఆరాధిస్తానని, రాజకీయంగా కాదని అన్నారు. బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రహం నెలకొందని అన్నారు. మ‌రి టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -