రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరనేది అనేక సార్లు నిరూపిత మయ్యింది. కాంగ్రెష్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ కాంగ్రెస్ జతకట్టిన సంగతి తెలిసిందే. రాహుల్ను, సోనియాను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టిన బాబు కాంగ్రేస్ కాల్ల దగ్గరకు చేరారు.
ఇక ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నాయకుల్లో ప్రధానంగా జగన్, పవన్లు పోరాడుతున్నారు. జగన్ పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్, పవన్లు మరో సంలనాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్ర ప్రతయోజనాలకోసం ఇద్దరూ బీజేపీకివ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే.
అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ పేరెత్తుతే జగన్ విరుచుకు పడతారు. దివంతగ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ను కాంగ్రెస్, టీడీపీ కలసి అక్రమాస్తుల కేసులు బనాయించి ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలసిందే. ఇక పవన్ విషయానికి వస్తే ఇక కాంగ్రెస్ నాయకులని గుడ్డలూడి దీసి తంతా అన్న పవన్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలసిందే.
బద్ద శత్రువులుగా ఉన్న టీడీపీ – కాంగ్రెస్ అలయెన్స్ అనేసరికి ఆలోచనలో పడ్డారు.. మన ముందు ఏ దారి అని ఇటు గోదావరి అబ్బాయి పవన్ ఆలోచిస్తుంటే, ఇటు సీమ నేత జగన్ ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే జగన్, పవన్ మధ్య అంత విబేధాలు లేవు. ఇద్దరూ కూడా బాబు ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. తాజాగా ఓ సీనియర్ నాయకుడు తన మనసులోని మాటను బయటపెట్టారు.
పవన్ జగన్ కలిసి వచ్చేఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది అని అయితే, పవన్ జగన్ ని కలుస్తారా లేదా ఇద్దరూ ఓ చోట భేటీ అవుతారా అనే సస్పెన్స్ ఈ పాదయాత్ర పూర్తి అయిన వెంటనే వస్తుంది అని తెలుస్తుందని చెప్పినట్లు సమాచారం. అమరావతిలో ఇద్దరూ పార్టీ కార్యాలయాల నిర్మాణం బిజీలో ఉన్నారు. ఇద్దరూ కూడా ఒకే సమయంలో అమరావతి ఏరియాలో భేటీ అవుతారు అని తెలుస్తోంది.
కాంగ్రెస్, టీడీపీ రెండూ కలసి పోవడంతో పవన్ ఆలోచనలో పడ్డారు. ఈ సమయంలో పవన్ కూడా స్వతంత్రంగా నిలబడాలా జగన్ కు మద్దతు ఇవ్వాలా అనేది, పొలిటికల్ గా సీనియర్ సిటిజన్స్ ఫుల్లుగా ఉన్న తమ జనసేనలో చర్చించి చెప్పనున్నారంట. మొత్తానికి జగన్ పుట్టిన రోజు, ఆయన పాదయాత్ర ముగింపు రోజు, సిక్కోలు ప్రజల బాధలు ఓదార్చుతూ సాగే యాత్ర ముగిసిన తర్వాత, పవన్ తో సినిమాటిక్ పొలిటికల్ భేటీ ఉంటుంది అని తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీలో క్లీన్ స్విప్ ఖావడం ఖాయమే.