జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఓ రెండు ఛానళ్లు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్ని ప్రెస్టేజియస్ గా తీసుకున్న పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. సందర్భానుసారం ప్రభుత్వానికి సవాళ్లు విసురుతూ హీటెక్కిస్తున్నారు. కానీ పవన్ ప్రశ్నించే తీరు ప్రజల్లోకి వెళ్లడం లేదనే వాదన వినిపిస్తుంది. ఓ వైపు పవన్ గురించి వ్యతిరేకంగా కొన్ని ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. దీంతో డైలమాలో పడ్డ పవన్ తనకంటూ ఓ ఛానల్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
దీనికితోడు ప్రజారాజ్యం ఓడిపోవడానికి కారణం మీడియా లో ప్రాధాన్యత లేకపోవడమే. దీన్ని అంచనా వేసిన చిరంజీవి పవన్ కి సలహా కూడా ఇచ్చారట. ఛానల్ ను ప్రారంభించడమో, ఇప్పటికే ఉన్న ఛానళ్లను టేక్ ఓవర్ చేస్తే బాగుంటుందని చెప్పారట. అంతేకాదు పవన్ తెరవెనక చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్, ప్రజారాజ్యం నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ ఐపీఎస్ , బిజినెస్ మ్యాన్ తోట చంద్రశేఖర్ లు మీడియాలో కవరేజ్ కోసం కీరోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఇటీవల రెండు ఛానళ్లను ఓవర్ టేక్ చేసినట్లు తెలుస్తోంది. వాటిలో 10టీవీ, 99టీవీ ఈ రెండు ఛానళ్లు పవన్ కు మద్దతుగా ప్రసారాల్ని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 99 ఛానల్ను తీసుకున్న చంద్రశేఖర్ పవన్ పై వచ్చే నెగిటీవ్ పబ్లిసిటీని తిప్పికొట్టేలా ప్లాన్ చేస్తున్నారట. తోట చంద్రశేఖర్ ఇప్పటికే బిజినెస్ మ్యాన్ గా మంచి పేరు సంపాదించారు. రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడినా ఆయన పవన్ కోరుకున్నట్లే 99ఛానల్ ను కొనుగోలు చేశారు.
ఇక 10టీవీ కూడా పవన్ కు మద్దతుగా ఆగస్ట్ నుంచి కథనాల్ని వడ్డివార్చేందుకు సిద్ధంగా ఉంటున్నట్లు టాక్. ఎలాగూ పవన్ కు మద్దతు ఇస్తున సీపీఎం కూడా తమవైపు పవన్ కల్యాణ్ ఉన్నాడనే సంకేతాల్ని ఇస్తున్నాయట అపోజిషన్ పార్టీలకు .