Sunday, May 19, 2024
- Advertisement -

విజయవాడలో టీడీపీ టార్గెట్‌గా జనసేన ఫ్లెక్సీల కలకలం

- Advertisement -

రాష్ట్రంలో టీడీప , జ‌న‌సేన‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముద‌రి పాకాన ప‌డుతోంది. టీడీపే టార్గెట్ గా జ‌న‌సేన మందుకు పోతోంది. దీనిలో భాగంగానే తాజాగా విజ‌య వాడ‌లో ఫ్లెక్సీల కలకలం రేగుతోంది. రెండు పార్టీల మ‌ధ్య ప్లెక్సీల గొడ‌వ మొద‌లైంది. టీడీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ జనసేన పార్టీ పేరుతో ఈ పోస్టర్లు నగరంలో దర్శనమిచ్చాయి.

రెండు మూడు రోజుల కిందట జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ కొద్ది రోజుల క్రితంటీడీపీ నాయకులు కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అన్నదమ్ములు కలిసి ప్రజారాజ్యం పేరుతో పోటీ చేసినా 18 సీట్లే వచ్చాయనీ, ఇప్పుడు కొత్తగా ప్రగల్భాలు పలకడం మానుకోవాలని చురకలు అంటించారు.

టీడీపీ ఫ్లెక్సీల‌కు ధీటుగా జ‌న‌సేన కూడా ప్లెక్సీల‌ను ఏర్పాటు చేసింది. టీడీపీ నేతలు, ప్రభుత్వం లక్ష్యంగా జనసేన పేరుతో తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పిచ్చి ముదిరిన పచ్చకాలం.. ఏం తమ్ముళ్లూ.. వేధిస్తోందా ఓటమి భయం?, గుర్తుకు వస్తోందా పదేళ్ల ప్రతిపక్ష కాలం. 2009లో విజయవాడలో జీరోగా ఉన్న మీరు 2014కల్లా హీరోగా ఎలా మారారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురింపించారు.విజయవాడలో విజయం సాధించడం మీ నాయకుడి తంత్ర ఫలమా? లేక మా నాయకుడి కాళ్లు మొక్కిన ఫలమా..? అని తీవ్రంగా మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో టీడీపీ పోస్టర్లకు కౌంటర్ గా జనసేన నేతలు కొత్త పోస్టర్లు, ప్లెక్సీలను అంటించారు. కాగా, ఈ వ్యవహారం చేయి దాటకుండా ఉండేందుకు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని నగర పోలీసులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -