Thursday, May 16, 2024
- Advertisement -

చంద్రబాబుకు మళ్లీ షాక్.. వైసీపీలోకి టీడీపీ నేత..?

- Advertisement -

ఏపీ అధికార పార్టీ నేత… ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు మరో ఊహించని షాక్ తగకనుందని తెలుస్తోంది. ఇప్పటికే నంద్యాల ఉపఎన్నికల్లో ఏం చేయాలో అర్ధం కాక ఆలోచిస్తున్న చంద్రబాబుకు.. నంద్యాల ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఈ షాక్ నుంచి బయటకు రాక ముందే మరో షాక్ తగలనుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్ర‌కాశం జిల్లా.. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి, ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గీయుల మ‌ధ్య చోటు చేసుకుంటున్న వివాదాలపై సీఎం చంద్రబాబుకు క‌ర‌ణం బ‌ల‌రాంకు పెద్ద షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా వీరి మధ్య అధిపత్యపోరు జరుగుతోంది. దాంతో క‌నిగిరిలో జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య స‌మావేశంలో గొట్టిపాటి ర‌వికుమార్ చాలా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని.. పార్టీలో ఉండాలో లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన చంద్ర‌బాబు అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్‌ నిర్ణయమే ఫైనల్‌ అని తెల్చి చెప్పేశారు.

అక్కడ ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవద్దని.. ఎవరైన తలదూర్చితే.. చర్యలు తీసుకోవాల్సి పరిస్థితి వస్తోందని చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారట. దాంతో త్వరలో కరుణం టీడీపీకి గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నాడట. ఒక వేళ పార్టి వీడాల్సి వస్తే.. వైసీపీ ప్ర‌త్యామ్నాయం కాబ‌ట్టి.. ఆ పార్టీలోకి చేరే అవకాశాలు చాలానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే బలరాం జగన్ ను కలిసి పార్టీలో చెరడం ఖయామని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -