Friday, May 24, 2024
- Advertisement -

చిరంజీవిపై వివాదాస్ప‌ద ట్వీట్ చేసిన క‌త్తి మ‌హేష్‌…

- Advertisement -

క‌త్తి మహేష్… అలియాస్ కాంట్రవర్సీ కత్తి ట్విట్టర్ వేదికగా ఏదో ఒక కామెంట్ చేస్తూ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క‌త్తి మ‌ధ్య జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఏదో విధంగా దానికి పుల్‌స్టాప్ ప‌డింది. నిన్న రవితేజ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టి మరీ వార్తల్లోకి వచ్చిన మహేష్ కత్తి.. రామ్ గోపాల్ వర్మ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమాకు సపోర్ట్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యాడు. అయితే ఇప్పుడు క‌త్తి రూట్ మారింది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా మరో వివాదాస్పద ట్వీట్ చేసి వేడి రాజేశారు. తాజాగా కేంద్ర బడ్జెట్ కేటాయిపుల్లో ఏపీకి అన్యాయం చేశారంటూ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు(టీడీపీ, వైసీపీ) పార్లమెంట్ ఉభయ సభల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. లోక్ సభ, రాజ్యసభల్లో వెల్ లోకి దూసుకుపోవచ్చి ‘సేవ్ ఏపీ’ అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నిరసనకు దిగిన ఏపీ ఎంపీలలో మెగాస్టార్ చిరంజీవి కనిపించకపోవడంపై తనదైన శైలి ట్వీట్ చేశారు మహేష్ కత్తి.

ఎంపీ కొణిదెల చిరంజీవి కనిపించుట లేదు’ అంటూ ఆంధ్రప్రదేశ్ నుంచీ వెళ్లిన 25 మంది లోక్ సభ సభ్యులలో 16 మంది వ్యాపారస్తులు. వాళ్ళ వ్యాపార అవసరాలు, లావాదేవీలు,లాభాలను పరిరక్షించుకోవడంలో ఉన్న లాలూచీల కారణంగా,రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడే ఉత్సుకతని చూపించరు.’ అంటూ మరో ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చలసాని శ్రీనివాస్‌గారి నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమానికి నా సంఘీభావం. అంటూ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపారు మహేష్ కత్తి. క‌త్తి మ‌హేష్ చేసిన ట్వీట్ ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -